Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరువు నష్టం కేసులో కోర్టుకు రాహుల్ గాంధీ ఊరట

వరుణ్
మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (19:07 IST)
కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో హాజరయ్యేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సుల్తాన్‌పూర్ జిల్లా సివిల్ కోర్టుకు చేరుకున్నారు. ఈ కేసులో ఆయనకు ఊరట లభించింది. కాగా, గత 2018లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కొనసాగుతున్న కేసులో రాహుల్ గాంధీ మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. 
 
ఈ క్రమంలో కోర్టు దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశారు. రాహుల్ గాంధీ కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్రను మంగళవారం ఉదయం కొద్దిసేపు నిలిపివేశారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు అమేథీలోని ఫుర్సత్‌ గంజ్ నుంచి యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది.
 
బెంగళూరులో 2018 విలేకరుల సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై "అభ్యంతకరమైన" వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై 2018లో బీజేపీ నేత విజయ్ మిశ్రా రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. అప్పటి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా హయాంలో జరిగిన హత్య కేసులో బీజేపీ ప్రమేయం ఉందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.
 
రాహుల్ గాంధీకి జారీ చేసిన సమన్లపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పందించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పట్టాలు తప్పదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇలాంటి వాటికి రాహుల్ గాంధీ, భారత జాతీయ కాంగ్రెస్ బెదిరిపోదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments