Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలుకను చంపిన నిందితుడిపై 30 పేజీల చార్జిషీట్

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2023 (09:19 IST)
ఎలుకను చంపిన కేసులో నిందితుడిపై పోలీసులు 30 పేజీల చార్జిషీటును తయారు చేసి కోర్టుకు అందజేశారు. ఈ ఎలుక హత్య గత యేడాది నవంబరులో జరిగింది. ఎలుక తోకకు రాయికట్టిన నిందితుడు కుమార్ దానికి కాలువలో పడేశాడు. దీంతో అది చనిపోయింది. దీన్ని గమనించిన వికేంద్రశర్మ అనే వ్యక్తి దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేయగా, అది అప్పటికే చనిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 
 
దీంతో నిందితుడిపై వికేంద్రశర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత నిందితుడు బెయిలుపై విడుదలయ్యాడు. ఎలుక కళేబరానికి శవపరీక్ష చేసి ఫోరెన్సిక్ నివేదికను తయారు చేశారు. ఇందులో కాలేయ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకిందని, ఫలితంగా అది ఊపిరాడక చనిపోయినట్టు తేలింది. 
 
ఈ కేసుకు సంబంధించి పోలీసులు తాజాగా నిందితుడు కుమార్‌పై 30 పేజీల చార్జి‌షీటును దాఖలు చేశారు. కాగా, ఈ ఘటనపై కుమార్ తండ్రి మతూరా కుమార్ మాట్లాడుతూ, తన కుమారుడిపై చర్యలు తీసుకోవడానికి ముందు కోళ్లు,చేపలు, గొర్రెల మాంసాన్ని విక్రయించే వారిపైన, ఎలుకలను చంపే రసాయనాలు అమ్మే వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments