Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుంభమేళాతో ఓ కుటుంబం రూ.30 కోట్లు సంపాదించిందంటున్న సీఎం యోగి.. ఎలా?

ఠాగూర్
బుధవారం, 5 మార్చి 2025 (10:53 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో 45 రోజుల పాటు సాగిన మహాకుంభమేళాలో ఒక కుటుంబం ఏకంగా రూ.30 కోట్లు సంపాదించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అలాగే, ఈ కుంభమేళా మహోత్సవం అనేక మందికి ఎంతో కొంత ఆర్థికంగా లాభపడిందన్నారు. ఓ కుటుంబం 130 పడవలు నడిపి రూ.30 కోట్లు అర్జించినట్టు తెలిపారు. కుంభమేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్‌లో పడవలు నడిపేవారు దోపిడీకి గురయ్యారంటూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు చేసిన ఆరోపణలపై సీఎం యోగి పై విధంగా స్పందించారు. 
 
తాను ఒక పడవ నిడిపే వ్యక్తి విజయగాథను మీతో పంచుకుంటాను. ఆ కుటుంబానికి 130 ఉన్నాయని, ఒక్కో పడవతో గరిష్టంగా రూ.52 వేల వరకు సంపాదించారని తెలిపారు. 45 రోజుల్లో ఒక్కో పడవతో రూ.23 లక్షలు చొప్పున సంపాదించారని, మొత్తంగా 130 పడవలతో రూ.30 కోట్ల వరకు అర్జించినట్టు సీఎం వివరించారు. 
 
ఎలాంటి అవాంతరాలు లేకుండా కుంభమేళాను విజయవంతంగా నిర్వహించామని యోగి తెలిపారు. 45 రోజుల్లో ఒక్క నేరం కూడా జరగలేదన్నారు. కుంభమేళా నిర్వహణకు ప్రభుత్వం రూ.7500 కోట్లు ఖర్చు చేయగా దాదాపు రూ.3 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని సీఎం సభకు తెలిపారు. హోటల్ పరిశ్రమ రూ.40 వేల కోట్లు, ఆహారం, ఇతర నిత్యావసర రంగానికి రూ.33  వేల కోట్లు, రవాణాకు రూ.1.5 లక్షల కోట్ల మేర ఆదాయం లభించినట్టు సీఎం యోగి తెలిపారు. ఈ యేడాది జీడీపీ వృద్ధికి ఈ కుంభమేళా ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిద్రమాత్రలు మింగిన గాయని కల్పన ఆరోగ్యం ఎలావుంది? (Video)

ప్లీజ్ అలా పిలవొద్దంటున్న అగ్ర హీరోయిన్!!

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం - నిద్రమాత్రలు మింగి(Video)

ఆమని నటించిన నారి సినిమా కి 1+1 టికెట్ ఆఫర్

Tamannaah break up:తమన్నా భాటియా, విజయ్ వర్మల డేటింగ్ కు పాకప్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments