Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల వేళ రైతులకు యూపీ సీఎం యోగి వరాలు

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (13:22 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను శనివారం జారీచేసింది. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులోభాగంగా, ఫిబ్రవరి 10వ తేదీన తొలి దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రైతులపై వరాల జల్లు కురిపించారు. 
 
వ్యవసాయ వినియోగ విద్యుత్‌ చార్జీలను సగానికి తగ్గించారు. పట్ణాల్లో బోరుబావుల కనెక్షన్లకు సంబంధించి ప్రస్తుతం యూనిట్‌కు 6 రూపాయలు వసూలు చేస్తుండగా, దీన్ని మూడు రూపాయలకు తగ్గించారు. 
 
అలాగే, గ్రామీణ ప్రాంతాల్లోని పంపుసెట్ల విద్యుత్ చార్జీలు కూడా రెండు రూపాయల నుంచి ఒక్క రూపాయికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పట్టణాల్లో ఫిక్స్‌డ్ చార్జీలను తగ్గించారు. హార్స్ పవర్‌కు ఇప్పటివరకు రూ.130 వసూలు చేస్తుండగా, దానిని రూ.65కు తగ్గించారు. 
 
గ్రామాల్లో ఇది రూ.70గా ఉంటే రూ.35కు తగ్గించారు. ఇక మీటర్లు లేని కనెక్షన్ల హార్స్‌ పవర్ రేటును రూ.170 నుంచి రూ.85కు తగ్గిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments