Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులో ఎయిర్‌బ్యాగులు మిస్సింగ్.. ఆనంద్ మహీంద్రాపై కేసు నమోదు

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (10:46 IST)
దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు. ఆయనపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ కేసు నమోదైంది. కారు భద్రత విషయంలో తనను మోసం చేశారంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై ఆయనపై ఈ కేసును కాన్పూర్ పోలీసులు నమోదు చేశారు. కొత్తగా కొనుగోలు చేసిన స్కార్పియో కారులోని ఎయిర్‌ బ్యాగులు తెరుచుకోని కారణంగా తన కుమారుడు మరణించాడంటూ రాజేశ్ మిశ్రా అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు నమోదైంది. ఇందులో ఆనంద్ మహీంద్రాతో పాటు మరో 12 మందిపై పోలీసులు కేసు నమోదైంది. 
 
ఈ వివరాలను పరిసీలిస్తే, రాజేశ్ మిశ్రా అనే వ్యక్తి గత 2020లో తన కుమారుడు అపూర్వకు రూ.17.39 లక్షలు వెచ్చించి స్కార్పియో కారును కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చారు. ఈ కారు 2022 జనవరి 14వ తేదీన అపూర్వ, తన స్నేహితులతో కలిసి లక్నో నుంచి కాన్పూర్‌కు తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో మంచు ఎక్కువగా ఉండటంతో ఎదురుగా ఉన్న రోడ్డు సరిగా కనబడక పోవడంతో అపూర్వ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అపూర్వ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
ప్రమాదం అనంతరం షోరూంకు వెళ్లిన మిశ్రా కారులోని లోపాల కారణంగానే తన కుమారుడు మరణించాడని ఆరోపించారు. తన కుమారుడు సీట్ బెల్టు పెట్టుకున్నా ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోలేదని ఫిర్యాదు చేశారు. కారు భద్రత విషయంలో కంపెనీ తనను మోసం చేసిందని వాపోయారు. సంస్థ తప్పుడు విధానాలను అవలంబించిందని పేర్కొన్నారు. అసలు కారులో ఎయిర్ బ్యాగ్స్ ఏర్పాటు చేయలేదని కూడా వెల్లడించారు. అమ్మకానికి ముందే కారును క్షుణ్ణంగా తనిఖీ చేసి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదన్నారు.
 
ఈ క్రమంలో షోరూం సిబ్బంది రాజేశ్‌తో వాగ్వాదానికి దిగడంతో వివాదం మరింత ముదిరింది. కంపెనీ డైరెక్టర్ల ఆదేశాల మేరకు సంస్థ మేనేజర్లు తనను, తన కుటుంబాన్ని బెదిరించారని కూడా రాజేశ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆనంద్ మహీంద్రాతో పాటు మరో 12 మందిపై ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్), 287, సెక్షన్ 304ఏ తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేవ్ పార్టీలో నటి రోహిణి.. నిజమేనా?

నన్ను జైలులో బంధిస్తారా? నేనేం తప్పు చేశాను.. సమంత ప్రశ్న

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌‌తో ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments