Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిప్స్, బిస్కెట్స్ తిన్న ముగ్గురు అక్కాచెల్లెళ్ళు మృతి

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (18:12 IST)
చిప్స్, బిస్కెట్స్ తిన్న ముగ్గురు అక్కాచెల్లెళ్ళు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ బరేలిలో చోటుచేసుకుంది. బరేలీ ప్రాంతానికి చెందిన నవీన్ కుమార్ సింగ్ కు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వారి పేర్లు పారి, పిహు, విధి కాగా ఈ ముగ్గురు చిన్నారులు చాలా చురుగ్గా ఉండేవారు. 
 
అయితే గత శుక్రవారం ముగ్గురు స్థానికంగా ఉన్న ఓ షాపులో బిస్కెట్స్, చిప్స్ కొనుక్కుని వచ్చారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి వాటిని తిన్నారు. అవి తిన్న తర్వాత 24 గంటల్లోపే ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
 
కడుపు నొప్పి వాంతులతో బాధ పడ్డారు. దాంతో తండ్రి నవీన్ కుమార్ స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం తీసుకెళ్తుండగా ఇద్దరు అక్కా చెల్లెలు పీహు, పారి మార్గమధ్యంలోనే మృతి చెందారు. ఇక విధి చికిత్స పొందుతూ నిన్న మృతి చెందినట్టు తెలుస్తోంది.
 
ఆదివారం నాడు చిన్నారుల అంత్యక్రియలు నిర్వహించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం చిన్నారులు తిన్న చిప్స్ బిస్కెట్లను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments