చిప్స్, బిస్కెట్స్ తిన్న ముగ్గురు అక్కాచెల్లెళ్ళు మృతి

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (18:12 IST)
చిప్స్, బిస్కెట్స్ తిన్న ముగ్గురు అక్కాచెల్లెళ్ళు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ బరేలిలో చోటుచేసుకుంది. బరేలీ ప్రాంతానికి చెందిన నవీన్ కుమార్ సింగ్ కు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వారి పేర్లు పారి, పిహు, విధి కాగా ఈ ముగ్గురు చిన్నారులు చాలా చురుగ్గా ఉండేవారు. 
 
అయితే గత శుక్రవారం ముగ్గురు స్థానికంగా ఉన్న ఓ షాపులో బిస్కెట్స్, చిప్స్ కొనుక్కుని వచ్చారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి వాటిని తిన్నారు. అవి తిన్న తర్వాత 24 గంటల్లోపే ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
 
కడుపు నొప్పి వాంతులతో బాధ పడ్డారు. దాంతో తండ్రి నవీన్ కుమార్ స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం తీసుకెళ్తుండగా ఇద్దరు అక్కా చెల్లెలు పీహు, పారి మార్గమధ్యంలోనే మృతి చెందారు. ఇక విధి చికిత్స పొందుతూ నిన్న మృతి చెందినట్టు తెలుస్తోంది.
 
ఆదివారం నాడు చిన్నారుల అంత్యక్రియలు నిర్వహించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం చిన్నారులు తిన్న చిప్స్ బిస్కెట్లను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుసు కదా ఒక రాడికల్ సినిమా అవుతుంది : సిద్ధు జొన్నలగడ్డ

Sundeep Kishan: సూపర్ సుబ్బు సిరీస్.. సెక్స్ ఎడ్యుకేషన్ ... సందీప్ కిషన్

Mamita Baiju: అందుకే డ్యూడ్‌.. నాకు ఒకేసారి సవాలుగా, ఉత్సాహంగా వుంది : మమిత బైజు

K-Ramp: దీపావళికి అన్ని హిట్ కావాలి. K-ర్యాంప్ పెద్ద హిట్ కావాలి : డైరెక్టర్ జైన్స్ నాని

Siddu jonnalgadda: యూత్ సినిమాలంటే.. ఎలా వుండాలో.. తెలుసు కదా. చెబుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆయుర్వేదం ప్రకారం నిలబడి మంచినీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments