Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో మరో దిశ ఘటన : రేప్ చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు...

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (11:18 IST)
హైదరాబాద్ నగరంలో జరిగిన దిశ అత్యాచార, హత్య ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఈ ఘటనను మరచిపోకముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇదే తరహా మరో ఘటన జరిగింది. ఓ యువతిపై అత్యాచారం జరిపి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో బాధిత యువతి 90 శాతం మేరకు కాలిన గాయాలతో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని ఉన్నావోలో ఓ యువతిపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారం జరిపారు. ఆ తర్వాత ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో బాధితురాలు 90 శాతం గాయాలతో లక్నోలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
నిజానికి ఈ అత్యాచారం చాలా రోజుల క్రితమే జరిగింది. అయితే, కామాంధులపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టింది. దీంతో ఆమెపై హత్యాయత్నం చేశారు. యువతి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments