Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో మరో దిశ ఘటన : రేప్ చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు...

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (11:18 IST)
హైదరాబాద్ నగరంలో జరిగిన దిశ అత్యాచార, హత్య ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఈ ఘటనను మరచిపోకముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇదే తరహా మరో ఘటన జరిగింది. ఓ యువతిపై అత్యాచారం జరిపి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో బాధిత యువతి 90 శాతం మేరకు కాలిన గాయాలతో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని ఉన్నావోలో ఓ యువతిపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారం జరిపారు. ఆ తర్వాత ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో బాధితురాలు 90 శాతం గాయాలతో లక్నోలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
నిజానికి ఈ అత్యాచారం చాలా రోజుల క్రితమే జరిగింది. అయితే, కామాంధులపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టింది. దీంతో ఆమెపై హత్యాయత్నం చేశారు. యువతి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments