Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూడ్చిపెట్టిన శవం తల నరికి ఎత్తుకెళ్లారు.. ఎవరు?

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (17:36 IST)
భారతదేశం ఓ వైపు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుంటే, ఇంకా చేతబడులు చేయడం వంటి మూఢనమ్మకాలతో తిరోగమిస్తోంది. అలాంటి ఘటనే కర్ణాటకలో జరిగింది. శ్మశానంలో పాతిపెట్టిన శవాన్ని దుండుగులు బయటకు తీసి, తల తీసుకుపోయిన సంఘటన కర్ణాటకలోని నెలమంగల తాలూకా భైరనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. 
 
భైరనహళ్లి గ్రామంలో నివాసం ఉంటున్న అరసయ్య (65) వయోభారంతో జనవరి 13న మృతి చెందాడు. మృతదేహాన్ని కుటుంబసభ్యులు గ్రామ శివారులో పాతిపెట్టారు. అయితే మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు శవాన్ని బయటకు తీసి తల నరికి ఎత్తుకెళ్లిపోయారు.
 
బుధవారం ఉదయాన్నే శ్మశానం వైపు వెళ్లిన స్థానికులు తన లేని శవాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే నెలమంగల రూరల్ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కుటుంబసభ్యులు మొండాన్ని తిరిగి పూడ్చిపెట్టారు. బుధవారం నాడు అమావాస్య కావడంతో చేతబడి చేయడం కోసం మాంత్రికులు ఈ చర్యలకు పాల్పడి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments