Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ కార్యకర్త హత్య... పాడె మోసిన స్మృతి ఇరానీ (Video)

Webdunia
సోమవారం, 27 మే 2019 (12:58 IST)
కాంగ్రెస్ కంచుకోట అమెథిలో రాహుల్ గాంధీపై 55,000 ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలుపొంది స్మృతి ఇరానీ పెద్ద సంచలనమే సృష్టించారు. తాజాగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ సాధారణ గ్రామస్థాయి కార్యకర్త చనిపోతే పాడె మోసి తన రుణం తీర్చుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ అమేథీ నియోజకవర్గంలో బరూలియా గ్రామానికి చెందిన సురేంద్ర సింగ్ బీజేపీ గ్రామస్థాయి నాయకుడు. గత ఎన్నికల్లో స్మృతి ఇరానీకి గెలుపు కోసం సురేంద్ర సింగ్ చాలా కష్టపడ్డాడు. అయితే కొందరు దుండగులు సురేంద్ర సింగ్‌ను శనివారం రాత్రి కాల్చి చంపారు. అమేథీలో రాహుల్ పైన స్మృతి ఇరానీ గెలుపొందిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
 
విషయం తెలుసుకున్న స్మృతి ఇరానీ వెంటనే బరులియా గ్రామానికి వచ్చి అతడి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మీ కుటుంబానికి అండగా ఉంటానని మాటిచ్చారు. అంతటితో ఆగకుండా సురేంద్ర సింగ్ పాడెను మోసి మానవత్వాన్ని చాటుకున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments