Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐబీ సూచనల మేరకే: జమ్మూ పరిస్థితిపై మంత్రి కిషన్ రెడ్డి

Webdunia
ఆదివారం, 4 ఆగస్టు 2019 (12:13 IST)
అమర్‌నాథ్ యాత్రకు ముప్పు ఉందని ఐబీ సూచన మేరకే ముందు జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో తాజా పరిస్థితిపై ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

న్యూఢిల్లీలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్లో తెలుగు ప్రజలు సహా మరెవరి భద్రతకు ఢోకా లేదన్నారు. శనివారం రాత్రి జమ్మూ కాశ్మీర్‌లో 20 మంది విద్యార్థులు స్వస్థలాలకు బయలుదేరారని మంత్రి చెప్పారు. శనివారం మధ్యాహ్నానికి తెలుగు విద్యార్థులు ఢిల్లీకి చేరుకుంటారని కిషన్ రెడ్డి తెలిపారు. మిగిలిన 90 మంది విద్యార్ధులు ఆదివారానికి ఢిల్లీకి చేరుకొంటారని మంత్రి స్పష్టంచేశారు. 
 
జమ్మూ నుండి విద్యార్దులు, పర్యాటకులు తమ స్వంత ప్రాంతాలకు వెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ మేరకు ఏర్పాట్లు చేసిందని మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. మరోవైపు జమ్మూలో నెలకొన్న తాజా పరిస్థితుల దృష్ట్యా అస్ట్రేలియాలో పాటు కొన్ని దేశాలు తమ పౌరులను స్వదేశాలకు తిరిగి రావాలని  కోరింది. ఈ పరిస్థితుల్లో కాశ్మీర్‌కు వెళ్లకూడదని కూడ జాగ్రత్తలు చెప్పింది. ఇప్పటికే కాశ్మీర్‌లో ఉన్న వారిని తమ దేశానికి రావాలని అత్యవసర సందేశాన్ని పంపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments