Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు తృటిలో తప్పిన ప్రమాదం

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (10:39 IST)
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు వాహనాన్ని ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టగా.. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. మంత్రి జమ్మూకాశ్మీర్‌ పర్యటనలో రామ్‌బన్‌ జిల్లా బనిహాల్‌ వద్ద జమ్మూ - శ్రీనగర్‌ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. ఉదంపూర్‌ సమీపంలో లోడుతో వెళ్తున్న ట్రక్కు బ్రేక్‌డౌనుకు గురైనట్లు అదనపు డీజీ ముకేశ్‌సింగ్‌ తెలిపారు. 
 
ప్రమాదం జరగ్గానే భద్రతా సిబ్బంది మెరుపువేగంతో స్పందించి కారు డోర్లు తెరిచి మంత్రిని బయటకు తీశారు. ఓ న్యాయసేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు జమ్మూకాశ్మీర్‌ వెళ్లిన కిరణ్‌ రిజిజు ఉదంపూర్‌ వరకు కారులో ప్రయాణించారు. 'ఈ అందమైన రహదారిని ఎవరైనా ఆస్వాదించవచ్చు' అంటూ విశాలమైన రోడ్డును చూపిస్తూ తీసిన వీడియోను ట్విటర్‌లో మంత్రి పోస్టు చేశారు. అంతలోనే ఇలా జరగడం యాదృచ్ఛికం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments