Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు తృటిలో తప్పిన ప్రమాదం

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (10:39 IST)
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు వాహనాన్ని ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టగా.. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. మంత్రి జమ్మూకాశ్మీర్‌ పర్యటనలో రామ్‌బన్‌ జిల్లా బనిహాల్‌ వద్ద జమ్మూ - శ్రీనగర్‌ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. ఉదంపూర్‌ సమీపంలో లోడుతో వెళ్తున్న ట్రక్కు బ్రేక్‌డౌనుకు గురైనట్లు అదనపు డీజీ ముకేశ్‌సింగ్‌ తెలిపారు. 
 
ప్రమాదం జరగ్గానే భద్రతా సిబ్బంది మెరుపువేగంతో స్పందించి కారు డోర్లు తెరిచి మంత్రిని బయటకు తీశారు. ఓ న్యాయసేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు జమ్మూకాశ్మీర్‌ వెళ్లిన కిరణ్‌ రిజిజు ఉదంపూర్‌ వరకు కారులో ప్రయాణించారు. 'ఈ అందమైన రహదారిని ఎవరైనా ఆస్వాదించవచ్చు' అంటూ విశాలమైన రోడ్డును చూపిస్తూ తీసిన వీడియోను ట్విటర్‌లో మంత్రి పోస్టు చేశారు. అంతలోనే ఇలా జరగడం యాదృచ్ఛికం. 

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments