Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజకీయ ఉద్ధండుడు శరద్ యాదవ్ ఇకలేరు

sharad yadav
, శుక్రవారం, 13 జనవరి 2023 (08:46 IST)
రాజకీయ ఉద్ధండుడు, జేడీయూ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపుడతూ వచ్చిన ఆయన గురువారం గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు వయసు 75 యేళ్లు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి యాదవ్ ఈ విషయాన్ని ట్వట్టర్‌లో వెల్లడించారు. "పాపా నవీ రహే (నాన్నగారు ఇకలేరు)" అంటూ పోస్ట్ చేశారు.
 
కాగా, శరద్ యాదవ్ ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. జనతాదళ్ (యు)కు ఆయనే తొలి జాతీయ అధ్యక్షుడు. 2016 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. అప్పట్లో నితీశ్ కుమార్ ఎన్డీయేత జతకట్టాలని నిర్ణయించుకోవడం శరద్ యాదవ్‌ను తీవ్రంగా కలిచివేసింది. దీన్ని శరద్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆయనపై బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగించారు. 
 
ఆ తర్వాత 2016లో ఆయన రాజ్యసభ సభ్యత్వంపై కూడా అనర్హత వేటు వేశారు. ఆ తర్వాత ఆయన సొంతంగా ఎన్.జె.డిని స్థాపించి, దీన్ని ఆర్జేడీలో విలీనం చేసి ప్రస్తుతం ఆర్జేడీ నేతగా కొనసాగుతున్నారు. శరద్ యాదవ్ పుట్టింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే అయినా బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెమీ ఫైనల్స్‌ను ప్రారంభించిన హాకీ ఆంధ్రప్రదేశ్ సభ్యుడు రాజశేఖర్