కంగేయం స్థానానికి 1000 మంది రైతుల నామినేషన్ల దాఖలు

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (15:59 IST)
తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో 1000 మంది రైతులు కంగేయం స్థానానికి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. పరంబికుళం-అల్లియర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలన్న డిమాండ్‌ను నాయకులు పట్టించుకోకపోవడంతో రైతులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఇదే విషయంపై ఐదు రోజులు నిరాహార దీక్షలు చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి ఇచ్చిన హామీతో రైతులు నిరాహార దీక్షను ముగించారు. 
 
సీఎం హామీ.. హామీగానే మిగిలిపోయిందని తమ డిమాండ్లు నెరవేరలేదని రైతులు అంటున్నారు. అందుకే ఎన్నికల వేళ రైతు కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి రైతులు చెబుతున్నారు. కమిటీ సభ్యులు మంగళవారం నుంచి నామినేషన్లు దాఖలు చేయడం ప్రారంభించారు. ఇప్పటికే 20కి పైగా నామినేషన్లు వేసినట్లు కమిటీ వర్గాలు తెలిపాయి.
 
ఈరోడ్ జిల్లాలోని మోడకురుచి అసెంబ్లీ సీటుపై రైతులు 25 సంవత్సరాల క్రితం ఇదే పనిచేశారు. 1996లో, 1,016 మంది రైతులు నామినేషన్ వేశారు, మొత్తం 1.033 మంది అభ్యర్థులు అప్పట్లో పోటీలో ఉన్నారు. ఇది ఎన్నికల సంఘానికి తలనొప్పిగా మారింది. చివరికి అక్కడ ఎన్నికలు ఒక నెల వాయిదా పడాల్సి వచ్చింది. 50 పేజీల బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వహించారు. నిజామాబాద్‌లో కూడా పసుపు రైతులు 158మంది పార్లమెంట్‌కు పోటీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments