Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 1.5 కోట్ల ఆస్తి రాసిచ్చిన వృద్ధుడు

Webdunia
మంగళవారం, 7 మార్చి 2023 (09:33 IST)
తన కుటుంబంపై అసంతృప్తితో వున్న ఓ వృద్ధుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 1.5 కోట్ల విలువైన ఆస్తిని ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. యూపీలోని ముజఫర్‌నగర్‌కు చెందిన 80 ఏళ్ల వ్యక్తి, తన కొడుకు, కోడలు తనను అసభ్యంగా ప్రవర్తించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
 
వివరాల్లోకి వెళితే.. నాథు సింగ్‌ అనే వృద్ధుడు రూ. 1.5 కోట్ల విలువైన ఇల్లు, భూమి ఉంది. అతనికి ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అతని కుమారుడు సహరాన్‌పూర్‌లో ఉంటూ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ముగ్గురు కూతుళ్లకు పెళ్లిళ్లయ్యాయి. 
 
అతని భార్య మరణం తరువాత, వృద్ధుడు ఖతౌలీలోని వృద్ధాశ్రమంలో ఒంటరిగా నివసిస్తున్నాడు. తన కుటుంబ సభ్యులెవరూ తనను చూడటానికి కూడా రాలేదని నాథు సింగ్ వెల్లడించారు. ఆ తర్వాత అతను ఆస్తిని యుపి ప్రభుత్వానికి అప్పగించాలని అఫిడవిట్ దాఖలు చేశాడు.
 
తన మరణం తరువాత ప్రభుత్వం పాఠశాల లేదా ఆసుపత్రిని తెరవడానికి భూమిని ఉపయోగించుకోవచ్చని అభ్యర్థనను జోడించాడు.
 
"ఈ వయసులో నేను నా కొడుకు, కోడలుతో కలిసి జీవించాలి కానీ వారు నన్ను బాగా చూసుకోలేదు. అందుకే ఆస్తిని బదలాయించాలనే నిర్ణయం తీసుకున్నాను" అని సింగ్ మీడియాతో అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments