Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరిగిన నిరుద్యోగుల సంఖ్య... మరి ప్రధాని మోదీ ఏం చెపుతారో?

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (14:13 IST)
దేశంలో నిరుద్యోగ భూతం విలయతాండవం చేస్తోంది. నిరుద్యోగులు నానాటికి పెరిగిపోతున్నారు. 2018లో తీసిన గణాంకాలతో పోలిస్తే దాదాపు 1.3 శాతం నిరుద్యోగం పెరిగింది. మంగళవారం విడుదల చేసిన సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎమ్ఐఈ) నివేదిక ప్రకారం 2018 సెప్టెంబర్‌లో 5.9 శాతంగా ఉన్న నిరుద్యోగం 2019 మార్చి నాటికి 7.2 శాతానికి చేరుకుందని వెల్లడైంది. 
 
2016 సంవత్సరం నాటి నుంచి ఇదే అత్యధిక నిరుద్యోగిత రేటు అని నివేదికలో తెలిపారు. ఒక్క ఫిబ్రవరి నెలలోనే దాదాపు ఆరు మిలియన్ల నిరుద్యోగులు పెరిగారని అంచనా. దేశవ్యాప్తంగా పదివేల కుటుంబాల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా సీఎమ్ఐఈ ఈ నివేదిక తయారు చేసింది. ఈ సమాచారం ప్రభుత్వం రూపొందించే నిరుద్యోగిత డేటాకి ఉపయోగపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఈ నివేదిక అధికారంలో ఉన్న బీజేపీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments