Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామసేతుపై మళ్లీ మొదలైన పరిశోధనలు.. సముద్రం నీటి అడుగున టూర్

Webdunia
బుధవారం, 27 జులై 2022 (18:16 IST)
రామేశ్వరం నుంచి శ్రీలంక వరకు వంతెన గురించి అందరికీ తెలిసిందే. అదే రామసేతు. ఇది రామాయణ కాలంనాటిదని హిందువుల ప్రగాఢ విశ్వాసం. నారాయణుడే నరుడిగా వచ్చి వారధి కట్టాడని నమ్ముతారు. కానీ దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికీ రామసేతుపై ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి.  
 
తాజాగా రామసేతుపై మళ్లీ పరిశోధనలు మొదలయ్యాయి. ఇది సహజ సిద్ధంగా ఏర్పడిందా? లేక మానవ నిర్మితమా? అనే విషయాన్ని తేల్చే పనిలో శాస్త్రవేత్తలు తలమునకలయ్యారు. 
 
సీతాదేవిని అపహరించిన రావణసూరుడిని అంతమొందించేందుకు లంకకు బయల్దేరేందుకు గాను శ్రీరాముడు వానర సేనతో ఈ వారధిని నిర్మించినట్లు చెప్తారు. వానరసేన సాయంతో రాళ్లను సముద్రంలో పేర్చి వారధి నిర్మిస్తారు.. ఆ వారధి పైనుంచే సముద్రాన్ని దాటి.. లంకకు చేరుకుని రావణాసురుడిని వధిస్తాడు శ్రీరాముడు.
 
ఇది పురాణ గాధే. ఆ వారధి ఇంకా ఉంది. అయితే సముద్రం నీటిలో ఉంది. 2003లో నాసా పరిశోధనలో కొన్ని నిజాలు బయటికి వచ్చాయి. భారత్‌-శ్రీలంక మధ్య సముద్రంలో ఇంకా సేతువు ఉందని శాటిలైట్ చిత్రాలతో గుర్తించింది నాసా. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి రామసేతు వారధి తెరపైకి వచ్చింది.
 
రాబోయే రెండేళ్లలో రామసేతు వారధిని అసలు నిజం తేల్చేందుకు రంగంలోకి దిగింది నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ. వారధి ప్రాంతంలో డ్రిల్లింగ్ ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమైంది. సముద్రం నీటి అడుగున పర్యటించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments