Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి దారుణం.. నిర్మాణంలో వంతెన కూలిపోయింది.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 23 ఆగస్టు 2020 (11:44 IST)
అర్థరాత్రి దారుణం జరిగింది. నిర్మాణంలో ఉన్న భారీ వంతెన ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం అర్థరాత్రి జరగడంతో అదృష్టవశాత్తు ప్రాణనష్టం సంభవించలేదు. ఈ దారుణం హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గురుగ్రామ్‌లో కొత్తగా ఓ వంతెన నిర్మిస్తున్నారు. ఇందులో కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలింది. అర్థరాత్రి సమయం కావడం ట్రాఫిక్ పెద్దగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించిన అధికారులు, శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు.
 
కాగా, రాజీవ్ చౌక్ నుంచి గురుగ్రామ్‌లోని సోహ్నా వరకు 6 కిలోమీటర్ల పొడవున రూ.2 వేల కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఓరియంటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఈ నిర్మాణ పనులను చేపట్టింది. 
 
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఫ్లై ఓవర్‌ ఎలివేటెడ్ రోడ్డు‌లోని కొంత భాగం కూలిపోయింద‌ని, దీనికారణంగానే ఈ ప్రమాదం సంభవించివుంటుందని ఓరియంటల్ కంపెనీ ప్రాజెక్ట్ హెడ్ శైలేష్ సింగ్ అభిప్రాయపడ్డారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం