సీఎం ఉద్ధవ్ ఠాక్రే నుంచి శాంతి మంత్రం - మాట్లాడుకుందాం రండంటూ కబురు

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (16:56 IST)
తనపై తిరుగుబాటు చేసిన సొంత పార్టీ ఎమ్మెల్యేలకు శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నుంచి కబురు వెళ్లింది. ముంబైకు వస్తే అన్ని విషయాలు మాట్లాడుకుందాం రండి అంటు విజ్ఞప్తి చేశారు. 
 
పార్టీ నుంచి తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు కొందరు టచ్‌లో ఉన్నారంటూ శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించగా.. అదంతా అవాస్తవమేనని తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే అంటున్నారు. అంతేకాకుండా, పార్టీ అధిష్టానంతో టచ్‌లో ఉన్న ఆ ఎమ్మెల్యేల పేర్లు కూడా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
 
ఈ పరిణామాల క్రమంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే గౌహతిలోని స్టార్‌ హోటల్‌లో బస చేసిన రెబల్‌ ఎమ్మెల్యేలకు కీలక విజ్ఞప్తి చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా గౌహతిని వీడి ముంబైకు తిరిగి వస్తే తనతో కూర్చొని మాట్లాడితే పరిష్కారం దొరుకుతుందని లేఖ రాశారు. 
 
'మీలో చాలా మంది మాతో టచ్‌లో ఉన్నారు.. అంతేకాకుండా మీరంతా శివసేన గుండెల్లో ఉన్నారు. రండి.. మాట్లాడుకుందాం.. అప్పుడే ఒక పరిష్కారం దొరుకుతుంది' అని అన్నారు. 'సమయం ఇంకా మించిపోలేదు. నాతో కూర్చొని మాట్లాడండి. తాజా పరిణామాలతో శివసైనికులు, ప్రజల్లో ఏర్పడిన అనేక సందేహాలను తొలగించాలన్నారు. 
 
ఎవరి మాటలకూ లొంగిపోవద్దు. శివసేన మీకు ఇచ్చిన గౌరవం మరెక్కడా దొరకదు. మీరు వచ్చి నాతో మాట్లాడితేనే ఏదో ఒక పరిష్కారం లభిస్తుంది. ఒక పార్టీ అధ్యక్షుడిగా, కుటుంబ పెద్దగా మీ అందరి పట్ల నేను ఆందోళనతో ఉన్నా' అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments