Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాక్లెట్లు అనుకుని ఎలుకల మందు తినేసిన చిన్నారుల మృతి.. ఆటోలో..

ఆ చిన్నారులు ఆ ఎలుకల మందుతో కూడిన చిన్నపాటి కేకులను చాక్లెట్లో లేదా బర్ఫీలు అనుకున్నారో ఏమో కానీ.. ఎలుకల మందును ఆహార పదార్థంగా భావించి తిన్న ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌ బరాబం

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (16:12 IST)
ఆ చిన్నారులు ఆ ఎలుకల మందుతో కూడిన చిన్నపాటి కేకులను చాక్లెట్లో లేదా బర్ఫీలు అనుకున్నారో ఏమో కానీ.. ఎలుకల మందును ఆహార పదార్థంగా భావించి తిన్న ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌ బరాబంకీలోని ఇస్లాంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన దివ్యాంశ్(2), హృదేశ్(2)లు మంగళవారం తమ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ఆటోలో ఆడుకునేందుకు వెళ్లారు. ఆటోలో వారికి ఎలుకల మందు కనిపించింది. దానిని తినే పదార్థంగా భావించిన వారిద్దరూ తినేశారు.
 
కానీ ఆపై వాంతులు చేసుకుని ఆస్పత్రి పాలయ్యారు. అయితే అప్పటికీ పరిస్థితి విషమించడంతో బుధవారం ఆ చిన్నారులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments