Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో ఇద్దరు ఖైదీలకు కరోనా వైరస్

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (14:47 IST)
కరోనా మహమ్మారి క్రమక్రమంగా విస్తరిస్తుంది. రోజురోజుకి కరోనా భాదితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా ను అరికట్టడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ చాపకింద నీరులా విస్తరిస్తూ పంజా విసురుతోంది.దీంతో కర్ణాటక ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.
 కర్ణాటకలో ప్రస్తుతానికి 463 కేసులు నమోదు కాగా వాటిలో 150 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. 
 
వైరస్ సోకిన వారిలో 18 మంది మృతి చెందినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే మృతి చెందిన వాళ్లు 55-80 ఏళ్లలోపు వారే అధికంగా ఉండటాన్ని గమనించిన సర్కారు రాష్ట్రంలో 55 ఏళ్లు వయస్సు పై బడిన వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.
 
మరోవైపు కర్ణాటక రాష్ట్రంలోని పాద్రాయ ణపుర జైలులో ఇద్దరు ఖైదీలకు కరోనా వైరస్ సోకిన ఘటన సంచలనం రేపింది.ఇటీవల ఆరోగ్య కార్యకర్తలపై కొందరు దాడి చేసిన కేసులో నిందితులైన 119 మందిని పోలీసులు అరెస్టు చేసి వారిని రామనగర ప్రాంతంలోని పాద్రాయణపుర జైలుకు తరలించారు. వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వారిని క్వారంటైన్ కు తరలించారు.
 
ఈ జైలు నుంచి మరో 8 మందిని మరో ప్రాంతానికి తరలించారు. దీంతో సిఎం యాడియూరప్ప ఉన్నత స్ధాయి సమావేశాన్ని ఏర్నాటు చేశారు. తక్షణమే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments