Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో కూలిన నేవీ శిక్షణ విమానం.. ఇద్దరు మృతి

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2020 (11:47 IST)
కేరళ రాష్ట్రంలో ఘోరం జరిగింది. నేవీ శిక్షణ విమానం కుప్పకూలిపోయింది. దీంతో ఇద్ద‌రు నౌకాద‌ళ అధికారులు మృతిచెందారు. రోజువారీ శిక్ష‌ణ‌లో భాగంగా ఆదివారం ఉద‌యం ఐఎన్ఎస్ గ‌రుడ నుంచి బ‌య‌ల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేప‌టికే కొచ్చిలోని నావెల్ బేస్ స‌మీపంలో ఉన్న తొప్పంపాడి బ్రిడ్జి వ‌ద్ద కుప్ప‌కూలిపోయింది.
 
ఈ ప్రమాదంలో అందులో ఉన్న నేవీ అధికారులు లెఫ్టినెంట్ రాజీవ్ ఝా (39), పెట్టీ ఆఫీస‌ర్ సునీల్ కుమార్ (29) అక్క‌డిక్క‌డే మ‌ర‌ణించారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై నౌకాద‌ళ ఉన్న‌తాధికారులు విచార‌ణ‌కు ఆదేశించారు. రాజీవ్ ఝా ఉత్త‌రాఖండ్‌కు చెందిన‌వారు. ఆయ‌న‌కు భార్యా, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. 
 
సునీల్ కుమార్ స్వ‌స్థ‌లం బీహార్. ఆయ‌న‌కు ఇంకా వివాహం కాలేదు. కాగా, రెండు రోజుల క్రితం క‌ర్ణాట‌క‌లోని క‌ర్వార్ ప్రాంతంలో శిక్ష‌ణ విమానం కూలింది. విమానం స‌ముద్రంలో ప‌డిపోవ‌డంతో ఓ అధికారి మ‌ర‌ణించ‌గా, మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌పడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments