Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు బాలికలు .. 8 మంది యువకులు.. అడవిలోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (09:16 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన త్రిపురలో ఇద్దరు బాలికలు సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఈ దారుణానికి ఎనిమిది మంది యువకులు పాల్పడ్డారు. ఖౌవాయి జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఈ సామూహిక లైంగికదాడిలో తీవ్రంగా గాయపడిన ఓ బాలిక పరిస్థితి విషమంగా ఉంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖటియాబరి ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలు తమ ఇద్దరు స్నేహితులతో కలిసి సోమవారం సాయంత్రం బైక్‌పై బయటకు వెళ్లారు. కొంతదూరం వెళ్లిన తర్వాత మరో ఆరుగురు యువకులు బైక్‌లపై వచ్చి వారిని కలిశారు. 
 
ఆ తర్వాత వారంతా కలిసి ఆ ఇద్దరు బాలికలను అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికలు అపస్మారక స్థితికి వెళ్లడంతో భయపడిన యువకులు వారిని అక్కడే వదిలేసి పరారయ్యారు.
 
బాలికలు కనిపించకపోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారితో కలిసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అడవిలో అపస్మారకస్థితిలో ఉన్న బాలికలు కనిపించారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఓ బాలిక పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను మరో ఆసుపత్రికి తరలించారు. ఎనిమిది మంది కామాంధులపై  పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం