రెండాకులు మీవి కావు... శశికళ-దినకరన్‌లకు షాక్...

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (18:36 IST)
తమిళనాడులో జయలలిత మరణం తర్వాత పార్టీ రూపురేఖలు మారిపోయాయి. ఎవరికి తోచినట్లు వారు గ్రూపులను ఏర్పాటు చేసుకుని పార్టీని, అధికారాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. శశికళ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోగా, పళని స్వామి మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుండి పార్టీ తమదంటే తమదంటూ కోర్టుకు వెళ్లారు.
 
తాజాగా ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో తీర్పునిచ్చింది. అన్నాడీఎమ్‌‌కేకు చెందిన రెండాకుల గుర్తు, పార్టీ పేరు ముఖ్యమంత్రి పళని స్వామి వర్గానికే చెందుతుందని తీర్పు వెలువడింది. ఈ తీర్పుతో శశికళ, టీటీవీ దినకరన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2017 నవంబర్‌లో ఎన్నికల కమీషన్ పార్టీ పేరును, గుర్తును పళని స్వామికే కేటాయించింది. అయితే పార్టీ తమదంటూ టీటీవీ దినకరన్ కోర్టుకు వెళ్లారు.
 
జస్టిస్ జీ.ఎస్. సిస్థానీ, జస్టిస్ సంగీత దింగ్రా సెహగల్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. తాజా తీర్పుతో పార్టీపై వారికి ఎటువంటి హక్కు లేదని తేలిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments