Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రమంత్రి ఔదార్యం.. తన ఫస్ట్‌క్లాస్ సీటును మరో మహిళకు ఇచ్చేశారు!

కేంద్ర పౌరవిమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా ఔదార్యం ప్రదర్శించారు. విమానంలో తన ఫస్ట్‌క్లాస్ సీటును మరో మహిళకు ఇచ్చేశారు. ఆ తర్వాత ఆయన అదే విమానంలో సాధారణ వ్యక్తిలా మరో సీటులో కూర్చొని తన గమ్యస్థానానిక

Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (08:37 IST)
కేంద్ర పౌరవిమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా ఔదార్యం ప్రదర్శించారు. విమానంలో తన ఫస్ట్‌క్లాస్ సీటును మరో మహిళకు ఇచ్చేశారు. ఆ తర్వాత ఆయన అదే విమానంలో సాధారణ వ్యక్తిలా మరో సీటులో కూర్చొని తన గమ్యస్థానానికి చేరుకున్నారు. ఇంతకీ ఆ మహిళకు మంత్రి తన ఫస్ట్ క్లాస్ సీటును ఎందుకిచ్చారో ఓసారి పరిశీలిద్ధాం. 
 
శ్రేయ ప్రదీప్ అనే యువతి తన తల్లితో కలిసి అదే విమానంలో ప్రయాణిస్తోంది. తల్లి కాలికి దెబ్బతగలడంతో ఆమె నడవలేని స్థితిలో ఉంది. దీనికితోడు విమానంలో వారికి కేటాయించిన సీటు సరిగా లేకపోవడంతో అందులో కూర్చునేందుకు ఆమె చాలా ఇబ్బంది పడింది. 
 
ఆ మహిళ అవస్థను గమనించిన శ్రేయ.. అదేవిమానంలో ప్రయాణిస్తున్న కేంద్రమంత్రి జయంత్ సిన్హా వద్దకు వెళ్లి పరిస్థితి వివరించి, తమ సీట్లోకి వెళ్లి ఆ సీటును ఇవ్వాల్సిందిగా కోరింది. మంత్రి మరేమీ మాట్లాడకుండా భార్యతో కలిసి సీట్లు మారి వారికి తమ సీట్లను అప్పగించారు. మంత్రి చేసిన సాయాన్ని శ్రేయ ట్విట్టర్ ద్వారా పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు. సిన్హాతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. దీనికి స్పందించిన మంత్రి 'యు ఆర్ వెరీ వెల్‌కమ్' అని రీట్వీట్ చేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments