Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాము కాటుకు ఇద్దరు కవల పిల్లలు మృతి.. ఎక్కడంటే..?

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (13:28 IST)
పాము కాటుకు ఇద్దరు కవల పిల్లలు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌లోగల మర్ద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛోట్నామర్ద్ గ్రామంలో కవలలు మృతి చెందారు. ఈ బాలికల మృతి స్థానికంగా సంచలనం రేపింది. వారి మృతికి కారణం తెలియగానే అక్కడున్నవారంతా హతాశులైపోయారు. 
 
వివరాల్లోకి వెళితే.. కవలలు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఏడుస్తుండగా, తండ్రి వారిద్దరికీ గ్లాసుతో పాలు పట్టించాడు. పాలు తాగిన కొద్దిసేపటికే ఆ చిన్నారులిద్దరి నోటి నుంచి నురగలు రాసాగాయి. విషయం తెలియగానే చుట్టుపక్కల వారంతా బాధిత చిన్నారుల ఇంటికి వచ్చారు. వారంతా ఇంటిలోని నలుమూలలా చూడగా, ఒక పాము కప్పను మింగుతూ కనిపించింది. 
 
దీంతో ఆ పాము పాలను తాగి ఉంటుందని, ఆ పాలనే చిన్నారులు తాగి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే వారు ఆ బాలికలను ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు బాలికలు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments