Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాము కాటుకు ఇద్దరు కవల పిల్లలు మృతి.. ఎక్కడంటే..?

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (13:28 IST)
పాము కాటుకు ఇద్దరు కవల పిల్లలు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌లోగల మర్ద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛోట్నామర్ద్ గ్రామంలో కవలలు మృతి చెందారు. ఈ బాలికల మృతి స్థానికంగా సంచలనం రేపింది. వారి మృతికి కారణం తెలియగానే అక్కడున్నవారంతా హతాశులైపోయారు. 
 
వివరాల్లోకి వెళితే.. కవలలు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఏడుస్తుండగా, తండ్రి వారిద్దరికీ గ్లాసుతో పాలు పట్టించాడు. పాలు తాగిన కొద్దిసేపటికే ఆ చిన్నారులిద్దరి నోటి నుంచి నురగలు రాసాగాయి. విషయం తెలియగానే చుట్టుపక్కల వారంతా బాధిత చిన్నారుల ఇంటికి వచ్చారు. వారంతా ఇంటిలోని నలుమూలలా చూడగా, ఒక పాము కప్పను మింగుతూ కనిపించింది. 
 
దీంతో ఆ పాము పాలను తాగి ఉంటుందని, ఆ పాలనే చిన్నారులు తాగి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే వారు ఆ బాలికలను ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు బాలికలు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments