కరూర్‌ బాధితులను కలిసిన టీవీకే చీఫ్ విజయ్ - దర్యాప్తు చేపట్టిన సీబీఐ

సెల్వి
సోమవారం, 27 అక్టోబరు 2025 (18:47 IST)
Vijay
కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతరం చెన్నైకి తిరుగుముఖం పట్టిన టీవీకే పార్టీ అధినేత విజయ్‌.. అక్టోబర్ 27న చెన్నై మహాబలిపురంలో కరూర్ బాధితులను కలిశారు. ఈ సందర్భంగా కరూర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. 
 
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడిన విజయ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దుర్ఘటనకు క్షమాపణలు చెప్పారు. తప్పకుండా కరూర్ వచ్చి బాధితులను కలుస్తానని హామీ ఇచ్చారు. కరూర్ బాధిత కుటుంబ సభ్యులకు తప్పకుండా అండగా వుంటామని హామీ ఇచ్చారు. 
 
విద్య, ఉపాధి, వివాహాలకు ఆర్థిక సాయం అందిస్తానని విజయ్ బాధితులకు హామీ ఇచ్చినట్లు సమాచారం. కరూర్ ఘటన అనంతరం చెన్నైకి రావడం వెనుక భద్రతా సంబంధిత కారణాలున్నాయని విజయ్ బాధితులతో తెలిపారు. 
 
ఇకపోతే.. టీవీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ సభలో జరిగిన తొక్కిసలాట ఘటన కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేపట్టింది. తమిళనాడు హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. 
 
గత నెల 27న కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ కేసును ఐజీ ఆశా గార్గ్ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు చేపట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం