Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తికి 'నమస్తే ట్రంప్' కారణం : సంజయ్ రౌత్

Webdunia
ఆదివారం, 31 మే 2020 (17:07 IST)
దేశంలో కరోనా వైరస్ అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. అయితే, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తికి గల కారణాలను శివసేనకు చెందిన ఎంపి సంజయ్ రౌత్ వివరించారు. నమస్తే ట్రంప్ కార్యక్రమం వల్లే గుజరాత్, ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కరోనా బీభత్సం కొనసాగిస్తోందని ఆయన ఆరోపించారు. 
 
గత ఫిబ్రవరి నెలలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి లక్షలమంది ప్రజలు వచ్చారని, వారంతా తిరిగి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడంతో కరోనా వ్యాప్తి అధికమైందన్నారు. 
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను స్వాగతించడానికి భారీ సంఖ్యలో ప్రజలు రావడమే కరోనా వ్యాప్తికి కారణమని, ఈ విషయంలో కేంద్రం ఏ విధంగా సమర్థించుకోగలదని వ్యాఖ్యానించారు. 
 
ట్రంప్ వెంట అమెరికా నుంచి వచ్చిన కొందరు ముంబై, ఢిల్లీ వంటి నగరాలను సందర్శించారని, ఇలాంటి పరిణామాలే దేశంలో కరోనా వ్యాప్తికి దారితీశాయని రౌత్ విమర్శించారు. ఈ మేరకు సామ్నా పత్రికలోని తన సంపాదకీయంలో పేర్కొన్నారు.
 
కాగా, ప్రస్తుతం చైనాలో 62228 కరోనా పాజిటివ్ కేసుల ఉండగా, 2098 మంది చనిపోయారు. అలాగే, దేశంలో 1.82 లక్షల కేసులు నమోదైవుండగా, 5164 మంది ఇప్పటివరకు చనిపోయారు. 86984 మంది ఈ వైరస్ బారినుంచి కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments