Webdunia - Bharat's app for daily news and videos

Install App

చదవడం లేదనీ ఐదేళ్ళ బిడ్డను కొట్టి చంపిన తల్లి...

Webdunia
మంగళవారం, 21 మే 2019 (12:12 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లాలో దారుణం జరిగింది. చదవడం లేదని ఐదేళ్ల బిడ్డను కొట్టి చంపిందో కసాయి తల్లి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుచ్చి జిల్లా కాట్టుపుదూర్, పల్లివాసల్ గ్రామానికి చెందిన నిత్యకమలం (35), పాండ్యన్ (37) అనే దంపతులకు లతికా శ్రీ (5) అనే ఐదేళ్ళ కుమార్తె ఉంది. ఈమె స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో ఒకటే తరగతి చదువుతోంది. అయితే, ఇంటికి వచ్చిన తర్వాత ఇరుగు పొరుగు పిల్లలతో కలిసి ఆటలకే పరిమితమవడం, పొద్దస్తమానం టీవీకి అతుక్కునిపోయి చదవడం లేదని పేర్కొంటూ లతికాశ్రీని తల్లి నిత్యకమలం తీవ్రంగా కొట్టింది. 
 
దీంతో ఆ చిన్నారి అపస్మారక స్థితిలోకి జారుకోవడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. చనిపోయినట్టు నిర్ధారించారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి.. తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలులోకి వచ్చింది. బిడ్డ చదవడం లేదన్న ఆగ్రహంతో కొట్టానని, ఆ దెబ్బలను తాళలేక పాప స్పృహ కోల్పోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు చెప్పింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments