Webdunia - Bharat's app for daily news and videos

Install App

చదవడం లేదనీ ఐదేళ్ళ బిడ్డను కొట్టి చంపిన తల్లి...

Webdunia
మంగళవారం, 21 మే 2019 (12:12 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లాలో దారుణం జరిగింది. చదవడం లేదని ఐదేళ్ల బిడ్డను కొట్టి చంపిందో కసాయి తల్లి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుచ్చి జిల్లా కాట్టుపుదూర్, పల్లివాసల్ గ్రామానికి చెందిన నిత్యకమలం (35), పాండ్యన్ (37) అనే దంపతులకు లతికా శ్రీ (5) అనే ఐదేళ్ళ కుమార్తె ఉంది. ఈమె స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో ఒకటే తరగతి చదువుతోంది. అయితే, ఇంటికి వచ్చిన తర్వాత ఇరుగు పొరుగు పిల్లలతో కలిసి ఆటలకే పరిమితమవడం, పొద్దస్తమానం టీవీకి అతుక్కునిపోయి చదవడం లేదని పేర్కొంటూ లతికాశ్రీని తల్లి నిత్యకమలం తీవ్రంగా కొట్టింది. 
 
దీంతో ఆ చిన్నారి అపస్మారక స్థితిలోకి జారుకోవడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. చనిపోయినట్టు నిర్ధారించారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి.. తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలులోకి వచ్చింది. బిడ్డ చదవడం లేదన్న ఆగ్రహంతో కొట్టానని, ఆ దెబ్బలను తాళలేక పాప స్పృహ కోల్పోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు చెప్పింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments