Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.5 విలువ చేసే మ్యాగీ ధర రూ.193.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 17 జులై 2023 (16:14 IST)
సాధారణంగా ఆకలివేస్తే ఠక్కున గుర్తుకు వచ్చే ఇన్‌స్టంట్ ఫుడ్ మ్యాగీ. కేవలం రెండు నిమిషాల్లోనే నూరూరించే నూడుల్స్‌ను సిద్ధం చేసుకోవచ్చు. ఆకలేస్తే చటుక్కున గుర్తొచ్చేది మ్యాగీ. రెండు నిమిషాల్లోనే నోరూరించే నూడుల్స్ సిద్ధం కావడంతోపాటు ధర ఐదారు రూపాయలే ఉండడంతో చిన్నారుల నుంచి పెద్దల వరకు మనసు పారేసుకుంటారు. 
 
అదే మ్యాగీ ఎయిర్ పోర్టులో అయితే ఎంత ఉంటుంది? మహా అయితే ఓ 20 లేదా 30 రూపాయలు ఉంటుంది కావొచ్చు.. అనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్టే. బాగా ఆకలిగా ఉండడంతో ఓ విమానాశ్రయంలో మసాలా నూడుల్స్ కొనుగోలు చేసిన ఓ యూట్యూబర్‌కి కళ్లు బైర్లు కమ్మాయి. కారణం రూ.193 బిల్లు చేతిలో పెట్టడమే.
 
ఆ యూట్యూబర్ షేర్ చేసిన బిల్లు ఇపుడు వైరల్ అవుతుంది. మ్యాగీ మసాలా నూడుల్స్ ధర రూ.184గా చూపించి దానికి జీఎస్టీ రూ.9.20 జోడించడంతో రూ.193.20 బిల్లు అయింది. 20 పైసలు తీసేసి రౌండ్ ఫిగర్ 193 బిల్లు వేశారు. చేతికందిన బిల్లు చూసి గతుక్కుమన్న సేజల్ బిల్లు చెల్లించి, దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎలా రియాక్ట్ కావాలో తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు. 'మరీ ఇంత రేటా? దీనినేమైనా విమాన ఇంధనంతో చేశారో ఏమో మరి!' అంటూ రాసుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments