Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలులో మహిళ పర్సను చోరీ చేసిన దొంగ... పట్టుకుని కిటికీకి వేలడాదీసిన ప్రయాణికులు

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2023 (12:30 IST)
సాధారణంగా రద్దీగా ఉండే బస్సులు, రైళ్లలో జైబు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రయాణికుల చేతికి చిక్కి దెబ్బలు తింటుంటారు. తాజాగా ఓ దొంగ రైలు ప్రయాణికురాలి వద్ద పర్సు దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో అతన్ని రైలు కిటికీకి వేలడాదీశాడు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. దొంగకు తగిన శాస్తి జరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
 
బిహార్ రాష్ట్రంలోని బెగూసరాయ్‌ జిల్లా పరిధిలో శనివారం కటిహార్‌ నుంచి సమస్తిపుర్‌ వెళ్తున్న రైలులో ఓ మహిళ పర్సు చోరీకి గురైంది. కిటికీ ఊచలు పట్టుకొని వేలాడుతూ దూకేందుకు ప్రయత్నిస్తున్న దొంగను మిగతా ప్రయాణికులు గుర్తించారు. వెంటనే లోపలి నుంచి ఆ యువకుడి చేతులు గట్టిగా పట్టుకున్నారు. కొన్ని కిలోమీటర్లు అలాగే వేలాడుతూ ప్రయాణించాక.. బచ్వారా జంక్షనులో రైలు ఆగింది. 
 
ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌కు అతణ్ని అప్పగించారు. రైలు కిటికీకి దొంగ వేలాడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఒక విధంగా ఆ దొంగ ప్రాణాలను రైలు ప్రయాణికులు కాపాడారు. లేదంటే వేగంగా వెళుతున్న రైలు నుంచి కిందకు దూకివుంటే ఆ దొంగ ప్రాణాలు కోల్పోయేవాడని ప్రయాణికులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

ఆసక్తి రేపుతున్న పౌరుషం - ది మ్యాన్ హుడ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments