ఫ్లాట్‌ఫాం పైకి దూసుకొచ్చిన రైలు... మధుర రైల్వే స్టేషన్‌లో ఘటన

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2023 (10:14 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం జరిగింది. ఓ రైలు ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. ప్రయాణికులంతా దిగిపోయిన తర్వాత అకస్మాత్తుగా ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ ఘటన రజిగింది. అయితే అప్పటికే ప్రయాణికులంతా దిగిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. అయితే ఒక్కరు మాత్రం గాయపడ్డారు. 
 
మధుర రైల్వే స్టేషన్ డైరెక్టర్ ఎస్.కె.శ్రీవాస్తవ కథనం మేరకు.. షుకుర్ బస్తీ నుంచి వచ్చిన ఈఎంయూ రైలు రాత్రి 10.49 గంటల సమయంలో మధుర స్టేషన్‌కు చేరుకుంది. ప్రయాణికులు దిగి వెళ్లిపోయిన తర్వాత రైలు ఒక్కసారిగా ఫ్లాట్‌ఫాం పైకి ఎక్కేసింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకై, ప్రాణభయంతో పరుగులు తీశారు. అంత ఎత్తున్న ఫ్లాట్‌ఫ్లాంపైకి రైలు ఎలా ఎక్కిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఆ మార్గంలో ప్రయాణించాల్సిన కొన్ని రైళ్ళ రాకపోకలకు అంతరాయం కలిగింది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments