Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత సైన్యం ముందు లొంగిపోయిన కీలక ఉగ్రవాదులు..

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (11:04 IST)
భారత సైన్యం ముందు కీలక ఉగ్రవాదులు లొంగిపోయారు. భారత సైన్యానికి చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అమలు చేసిన వేగవంతమైన మరియు ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్‌లో హార్డ్కోర్ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ (స్వతంత్ర) నాయకుడు దృష్టి రాజ్ఖోవా లొంగిపోయారు. మేఘాలయ-అస్సాం-బంగ్లాదేశ్ సరిహద్దులో ఉగ్రవాదాలు లొంగిపోయినట్లు సైనిక అధికారిక వర్గాలు తెలిపాయి.
 
వేదాంత, యాసిన్ అసోమ్, రోప్జ్యోతి అసోమ్ మరియు మిథున్ అసోమ్ అనే నలుగురు సహచరులతో కలిసి ఆయన లొంగిపోయారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. గత తొమ్మిది నెలలుగా భద్రతా దళాలు ఉగ్రవాదులను పట్టుకోవటానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
దిగువ అస్సాంలో ఉగ్రవాద కార్యకలాపాలకు కారణమైన ఉల్ఫా ఉగ్రవాదుల కోసం చాలా కాలంగా గాలిస్తున్నారు. మిలిటెంట్ గ్రూపు సెకండ్ ఇన్ కమాండ్ అయిన రాజ్‌ఖోవా ప్రస్తుతం ఆర్మీ ఇంటెలిజెన్స్ అదుపులో ఉన్నారని, వారిని అస్సాంకు తీసుకువస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments