Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో నాలుగైదు గంటల్లో దంచికొట్టుడు వానలు...

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (11:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. అవి కూడా మరో నాలుగైదు గంటల్లో దంచికొడుతూ వర్షం పడనుంది. అందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా, లోతట్టు ప్రాంతాల వాసులను ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఏపీ విపత్తులశాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు. 
 
రాగల నాలుగైదు గంటల్లో రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. 
 
అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలతోపాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
ఐఎండీ సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ కన్నబాబు ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే పసుపు జెండా హెచ్చరిక చేసినట్టు పేర్కొన్నారు. కాగా, ఇటీవల హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments