Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో నాలుగైదు గంటల్లో దంచికొట్టుడు వానలు...

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (11:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. అవి కూడా మరో నాలుగైదు గంటల్లో దంచికొడుతూ వర్షం పడనుంది. అందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా, లోతట్టు ప్రాంతాల వాసులను ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఏపీ విపత్తులశాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు. 
 
రాగల నాలుగైదు గంటల్లో రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. 
 
అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలతోపాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
ఐఎండీ సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ కన్నబాబు ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే పసుపు జెండా హెచ్చరిక చేసినట్టు పేర్కొన్నారు. కాగా, ఇటీవల హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments