Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ మీడియా దుష్ప్రచారానికి కేజ్రీవాల్ అభినందనలు.. కేంద్రం తిప్పికొట్టాలి

పాకిస్థాన్‌లో అత్యవసరంగా విమానాలు కిందకు దించే పరిస్థితి రాకుండా చూసుకోవాలని పైలట్లకు ఇండియన్ ఎయిర్ లైన్స్ సూచించింది. దాయాది దేశంలో విమానం దించితే అదే మనకు తుది గమ్యం అవుతుందని హెచ్చరించింది. భారత సై

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (08:50 IST)
పాకిస్థాన్‌లో అత్యవసరంగా విమానాలు కిందకు దించే పరిస్థితి రాకుండా చూసుకోవాలని పైలట్లకు ఇండియన్ ఎయిర్ లైన్స్ సూచించింది. దాయాది దేశంలో విమానం దించితే అదే మనకు తుది గమ్యం అవుతుందని హెచ్చరించింది. భారత సైన్యం మెరుపు దాడులు చేసిన నేపథ్యంలో తమ భూభాగంలోని గగనతలంపై పాకిస్థాన్ ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మీదుగా రాకపోకలు సాగించే విమానాల పైలట్లకు ఎయిర్ ఇండియా పలు జాగ్రత్తలు సూచించింది.
 
సర్జికల్ దాడులపై పాకిస్థాన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని కేంద్ర సర్కారు అంతర్జాతీయ స్థాయిలో తిప్పికొట్టాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. దాడులపై పాక్‌ దుష్ప్రచారాన్ని బయటపెట్టిన మీడియాను సీఎం అభినందించారు. ''పలు మీడియా సంస్థలు పాకిస్థాన్‌ తప్పుడు ప్రచారాన్ని బహిర్గతం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. వారిని నా అభినందనలు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మాదిరిగానే పాక్‌ దుష్ప్రచారాన్ని అంతర్జాతీయ స్థాయిలో తిప్పికొట్టాలి'' అని సీఎం కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.
 
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఓ అధికారి తమ భూభాగంలో సర్జికల్‌ దాడులు జరిగినట్లు ఒప్పుకున్నారని మీడియాలో వచ్చిన వార్తలను కేజ్రీవాల్‌ ఊటంకించారు. సర్జికల్‌ దాడుల అనంతరం సోమవారం ఓ వీడియో మెసేజ్‌ విడుదల చేసిన సీఎం కేజ్రీవాల్‌ అందులో పాకిస్థాన్‌ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments