Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఓడితేనేం.. నా పంతం నెగ్గింది.. జగదీశ్ శెట్టర్

Webdunia
సోమవారం, 15 మే 2023 (08:43 IST)
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. కమలనాథులు టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించిన వారిలో మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత జగదీశ్ శెట్టర్ ఒకరు. 40 యేళ్లుగా బీజేపీతో అనుబంధం కలిగిన జగదీశ్‌కు ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ నేతలు టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.హుబ్లీ - ధార్వాడ్ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన తన శిష్యుడి మహేశ్ టెంగినకాయ్ చేతిలో 34 వేల ఓట్ల తేడాదో ఓటమిపాలయ్యారు. 
 
ఈ ఓటమిపై ఆయన స్పందించారు. తనను ఓడించేందుకు బీజేపీ డబ్బులు పంచిందని తాజాగా ఆరోపించారు. తాను ఓడినా.. తన పంతం నెగ్గిందని, ఇపుడు తనకు చాలా తృప్తిగా ఉందని చెప్పారు. తనకు టిక్కెట్ నిరాకరించినందుకుబీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని అపుడే చెప్పానని, ఆ ప్రభావం 20 నుంచి 25 స్థానాల్లో ఉంటుందని ఆయన చెప్పారు. 
 
ఆ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాదించారు. లింగాయత్‌లు తన వెంటే ఉన్నారని, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారని తెలిపారు. తనను ఓడించినా రాష్ట్రంలో మాత్రం బీజేపీ ఓడిందన్నారు. వాళ్ళ లక్ష్యం తనను ఓడించడమేనా? ఇదేనా వాళ్ల అంతిమ లక్ష్యం అని బీజేపీపై దుమ్మెత్తి పోశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments