Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఓడితేనేం.. నా పంతం నెగ్గింది.. జగదీశ్ శెట్టర్

Webdunia
సోమవారం, 15 మే 2023 (08:43 IST)
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. కమలనాథులు టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించిన వారిలో మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత జగదీశ్ శెట్టర్ ఒకరు. 40 యేళ్లుగా బీజేపీతో అనుబంధం కలిగిన జగదీశ్‌కు ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ నేతలు టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.హుబ్లీ - ధార్వాడ్ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన తన శిష్యుడి మహేశ్ టెంగినకాయ్ చేతిలో 34 వేల ఓట్ల తేడాదో ఓటమిపాలయ్యారు. 
 
ఈ ఓటమిపై ఆయన స్పందించారు. తనను ఓడించేందుకు బీజేపీ డబ్బులు పంచిందని తాజాగా ఆరోపించారు. తాను ఓడినా.. తన పంతం నెగ్గిందని, ఇపుడు తనకు చాలా తృప్తిగా ఉందని చెప్పారు. తనకు టిక్కెట్ నిరాకరించినందుకుబీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని అపుడే చెప్పానని, ఆ ప్రభావం 20 నుంచి 25 స్థానాల్లో ఉంటుందని ఆయన చెప్పారు. 
 
ఆ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాదించారు. లింగాయత్‌లు తన వెంటే ఉన్నారని, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారని తెలిపారు. తనను ఓడించినా రాష్ట్రంలో మాత్రం బీజేపీ ఓడిందన్నారు. వాళ్ళ లక్ష్యం తనను ఓడించడమేనా? ఇదేనా వాళ్ల అంతిమ లక్ష్యం అని బీజేపీపై దుమ్మెత్తి పోశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెండితెరపై కళ్యాణ్ బాబు మంచి ట్రీట్ ఇవ్వబోతున్నారు : మెగాస్టార్ చిరంజీవి

Hari Hara Veeramallu: ఈసారి డేట్ మారదు, ఇండస్ట్రీ రికార్డులు మారతాయి : దర్శకుడు జ్యోతికృష్ణ

Mahesh Babu: ఏ మాయ చేసావేలో మహేష్ బాబు నటించివుంటే ఎలా వుంటుంది?

Tamannaah: విజయ్‌తో బ్రేకప్ తర్వాత హ్యాపీగా వున్న తమన్నా.. ఫోటోలు వైరల్

Fish Venkat: ఫిష్​ వెంకట్​ మళ్ళీ అనారోగ్యంతో వెంటిలేటర్ పై చికిత్స !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments