Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీకి జై కొట్టిన స్వతంత్ర అభ్యర్థి లతా మల్లికార్జున

Webdunia
సోమవారం, 15 మే 2023 (08:20 IST)
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగించింది. అయితే, ఈ ఎన్నికల్లో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకపోవడంతో కొందరు ఎన్నికల్లో రెబెల్స్‌గా పోటీ చేస్తున్నారు. ఇలాంటివారిలో లతా మల్లికార్జున ఒకరు. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. హరపనహళ్ళిలో బీజేపీ సీనియర్ నేత గాలి కరుణాకర్ రెడ్డి ప్రత్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ ర్వాత ఆమె ఆదివారం బెంగుళూరులో కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య కలిసి సత్కరించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ తనకు టిక్కెట్ నిరాకరించినా రాజకీయ మనుగడ కోసం సతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాల్సి వచ్చిందన్నారు. అయితే, పార్టీకి మాత్రం విధేయురాలిగానే ఉంటానని చెప్పారు. లత తండ్రి, దివంగత ఎంపీ ప్రకాశ్‌కు స్వచ్ఛ రాజకీయ నేతగా మంచి పేరుంది. 
 
మరోవైపు, ఈ ఎన్నికల్లో గెలిచిన నలుగురు స్వతంత్ర అభ్యర్థుల్లో మేలుకొంటె నుంచి కాంగ్రెస్ అండతో విజయం సాధించిన దర్శన్ కూడా ఆ పార్టీకి మద్దతు ప్రకటించారు. దీంతో కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి మొత్తం బలం 137కు పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments