Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీకి జై కొట్టిన స్వతంత్ర అభ్యర్థి లతా మల్లికార్జున

Webdunia
సోమవారం, 15 మే 2023 (08:20 IST)
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగించింది. అయితే, ఈ ఎన్నికల్లో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకపోవడంతో కొందరు ఎన్నికల్లో రెబెల్స్‌గా పోటీ చేస్తున్నారు. ఇలాంటివారిలో లతా మల్లికార్జున ఒకరు. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. హరపనహళ్ళిలో బీజేపీ సీనియర్ నేత గాలి కరుణాకర్ రెడ్డి ప్రత్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ ర్వాత ఆమె ఆదివారం బెంగుళూరులో కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య కలిసి సత్కరించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ తనకు టిక్కెట్ నిరాకరించినా రాజకీయ మనుగడ కోసం సతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాల్సి వచ్చిందన్నారు. అయితే, పార్టీకి మాత్రం విధేయురాలిగానే ఉంటానని చెప్పారు. లత తండ్రి, దివంగత ఎంపీ ప్రకాశ్‌కు స్వచ్ఛ రాజకీయ నేతగా మంచి పేరుంది. 
 
మరోవైపు, ఈ ఎన్నికల్లో గెలిచిన నలుగురు స్వతంత్ర అభ్యర్థుల్లో మేలుకొంటె నుంచి కాంగ్రెస్ అండతో విజయం సాధించిన దర్శన్ కూడా ఆ పార్టీకి మద్దతు ప్రకటించారు. దీంతో కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి మొత్తం బలం 137కు పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments