Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగిన మత్తు.. దివ్యాంగుడైన కుమారుడికి నిప్పంటించిన తండ్రి

కుమారుడినే ఓ తండ్రి సజీవ దహనం చేశాడు. దివ్యాంగుడైన కుమారుడు పడే కష్టాలు చూడలేక తండ్రే ఈ పని చేశాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడి సమీప నాసరెద్

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (09:55 IST)
కుమారుడినే ఓ తండ్రి సజీవ దహనం చేశాడు. దివ్యాంగుడైన కుమారుడు పడే కష్టాలు చూడలేక తండ్రే ఈ పని చేశాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడి సమీప నాసరెద్‌కు చెందిన ముత్తుకుమార్‌కు భార్య శివగని, దివ్యాంగుడైన కుమారుడు హరిప్రసాద్‌ (14) ఉన్నారు. మద్యం మత్తులో ఉన్న అతను మంచంపై పడుకున్న హరిప్రసాద్‌కు నిప్పటించడంతో పూర్తిగా కాలిపోయినట్లు నాసరెద్‌ పోలీసులు తెలిపారు.
 
ఆపై ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ముత్తుకుమార్‌ను అరెస్ట్ చేశారు. హరిప్రసాద్ చిన్న వయస్సు నుంచే ఎదుగుదల లేకుండా ఉన్నాడని, మాటలు రాలేదని, చెవులు వినిపించవని చెప్పాడన్నారు. కొన్ని సంవత్సరాలుగా మంచానికే పరిమితం అయ్యాడని, అందువల్ల అతను అవస్థలను చూడలేక ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకపోవడంతో ఈ పని చేసినట్లు ఒప్పుకున్నాడు. 
 
తనకు, తన భార్య అన్న సామువేల్‌ పట్రోజ్‌కు మధ్య గొడవలు ఉన్నాయని, అతనిపై కక్షతో హరిప్రసాద్‌ను చంపి ఆ నేరం సామువేల్‌ పట్రోజ్‌పై వేయాలనుకున్నానని చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments