Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం గదిలో భార్య హత్య... భర్త ఆత్మహత్య.. ఎక్కడ?

Webdunia
గురువారం, 11 జూన్ 2020 (21:29 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఓ విషాదకర సంఘటన జరిగింది. శోభనం గదిలో భార్య హత్యకు గురికాగా, భర్త ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా మీంజూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మీంజూరుకు చెందిన నీతావాసన్ ‌(24), సంధ్య(20) అనే యువతీ యువకులు సమీప బంధువులు. వీరికి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. దీంతో బుధవారం ఉదయం వీరికి వివాహం జరిగింది. 
 
అదే రోజు రాత్రి ఈ నూతన దంపతులకు శోభనం ఏర్పాటు చేశారు. ఎన్నో ఆశలతో ఆమె శోభనం గదిలోకి అడుగుపెట్టింది. సుఖ, సంతోషాలతో గడపాల్సిన ఆ సమయంలో.. భార్యతో భర్త గొడవ పెట్టుకున్నాడు. తొలిరాత్రి గదిలో దంపతుల మధ్య తలెత్తిన వివాదం హత్య దాకా దారితీసింది. 
 
ఆవేశంలో భార్యను గునపంతో పొడిచి చంపాడు భర్త. అనంతరం ఇంటికి సమీపంలోని చెట్టుకు భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నూతన దంపతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments