Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటు వేసేందుకు ఆధార్ కార్డు తప్పనిసరికాదు : కేంద్ర ఎన్నికల సంఘం

వరుణ్
మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (08:55 IST)
ఓటు వేసేందుకు ఆధార్ కార్డు తప్పనిసరికాదని కేంద్ర ఎన్నిక సంఘం స్పష్టం చేసింది. ఓటరు ఐడీ లేదా ఇతర నిర్దేశిత గుర్తింపు పత్రాన్ని చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఓటర్లు ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోయినా, ఇతర చెల్లబాటుయ్యే పత్రాలతో ఓటు వేసేందుకు అనుమతిస్తామని హామీ ఇచ్చింది. బెంగాల్ ప్రజల ఆధార్ కార్డులను కేంద్ర ప్రభుత్వం డీయాక్టివేట్ చేస్తుందని టీఎంసీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొద్ది రోజుల క్రితం సంచలన ఆరోపణలు చేశారు. 
 
ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు సుఖేందుకు శేకర్ రే, డోలా సేన్, సాకేత్ గోఖలే, లోక్‌సభ ఎంపీలు ప్రతిమా మోండల్, సజ్దా అహ్మద్‌లతో కూడిన టీఎంసీ ప్రతినిధి బృందం కేంద్రం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలిసింది. తమ రాష్ట్రంలో ఆధార్ కార్డుల డీయాక్టివేషన్‌పై వస్తున్న ఆరోపణలను లేవనెత్తింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఓటు వేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరికాదని స్పష్టం చేసింది. 
 
"వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో వేలాది మంది ప్రజల ఆధార్ కార్డులను చట్టబద్దమైన ప్రక్రియను అనుసరించకుండా డీయాక్టివేట్ చేయడంపై మా ఆందోళనలను కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేశాం. రాష్ట్రంలో మొహరించిన కేంద్ర బలాగుల తమ పరిధిలో పని చేసేలా చూడాలని కోరారం. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీఈసీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో కేంద్ర బలగాలు చట్టానికి అనుగుణంగా పని చేసేలా ఆదేశాలివ్వాలని కోరాం అని టీఎంసీ రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవన్.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments