Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ దంపతులను కొట్టి.. వధువుపై గ్యాంగ్ రేప్

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2018 (12:08 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్ళూరు జిల్లాలో దారుణం జరిగింది. నవ దంపతులపై నలుగురు వ్యక్తులు దాడి చేసి.. వధువుపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
తిరువళ్ళూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవలే వివాహమైంది. తన భార్యతో కలిసి కుమరన్ నాయికన్ పేటలోని దేవాలయానికి దైవదర్శనానికి వచ్చాడు. దైవ దర్శనం అనతరం నవదంపతులు ఇద్దరూ బైక్‌పై తిరిగి ఇంటికి వెళ్తుండగా.. నలుగురు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ఆ నలుగురు నవ దంపతులపై దాడి చేశారు. వరుడి చేతిపై కత్తితో దాడి చేశారు. 
 
దీంతో భయపడిన వరుడు.. భార్యను అక్కడే వదిలి గ్రామంలోకి పరుగులు తీశాడు. గ్రామంలోకి వెళ్లి ఎవరినైనా సహాయం తీసుకువద్దామనుకొని అతను పరుగులు తీయగా.. అదే అదునుగా భావించిన దుండగులు వధువుపై అత్యాచారానికి తెగబడ్డారు. గ్రామానికి ఒక కిలోమీటర్ దూరంలో ఈ దారుణం జరిగింది. 
 
వరుడి సమాచారంతో గ్రామస్థులు అక్కడికి చేరుకోగా.. ఆలోపే నలుగురు దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గాలించి పట్టుకున్నారు. నిందితులు మునుస్వామి(36), మోహన్(29), మరో ఇద్దరు మైనర్లుగా గుర్తించారు. నలుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం