వదినను కట్టేసి ఐదుగురు స్నేహితులతో పొలాల్లో అత్యాచారం

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (20:21 IST)
పిల్లలు  పుట్టలేదన్న కారణంతో వేరే పెళ్ళి చేసుకుంది ఒక వివాహిత. తన అన్నను వదిలేసి వేరే పెళ్ళి చేసుకుందన్న కోపంతో వదినపైనే నీచానికి దిగాడు ఆమె మరిది. ఆమెపై పగ తీర్చుకునేందుకు అతి దారుణంగా పొలాల్లోకి లాక్కెళ్లి అక్కడ ఆమె చేతులు కాళ్లు కట్టేసి ఐదుగురు స్నేహితులను వెంటపెట్టుకుని వెళ్ళి అత్యాచారం చేసాడు.
 
రాజస్థాన్ లోని బరాన్ జిల్లాకు చెందిన మహిళకు సంవత్సరం క్రితమే వివాహమైంది. అయితే పిల్లలు పుట్టకపోవడంతో భర్తపై అనుమానంతో మూడు నెలల క్రితమే తెగతెంపులు చేసుకుని ఇంటికి వచ్చేసింది. పుట్టింటి వారి సలహాతో నెల క్రితమే మరో వివాహం చేసుకుంది.
 
తన పుట్టింటికి దగ్గరలోనే మెట్టినిల్లు కూడా ఉంది. అయితే మొదటి భర్త తమ్ముడు ఆమె రెండో పెళ్ళి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తన అన్నను మోసం చేసిందన్న కోపంతో రగిలిపోయాడు. తన స్నేహితులు ఐదుగురిని వెంట పెట్టుకుని పొలాల్లోకి వెళ్ళాడు. తన భర్తతో పాటు అతని చెల్లెలితో కలిసి పనిచేస్తున్న వదినపై లైంగిక దాడికి దిగాడు.
 
అడ్డొచ్చిన ఇద్దరిని త్రాళ్ళతో కట్టేశాడు. వారిద్దరు చూస్తుండగానే ఐదుగురు కలిసి ఒకరి తరువాత ఒకరు అత్యాచారం చేశారు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయారు. ఎలాగోలా అక్కడి నుంచి బయటకు వచ్చిన వారు పోలీసులకు ఫిర్యాదుచేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం