Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్లు కట్టలేదని బెడ్‌కే కట్టేశారు, మధ్యప్రదేశ్ ఆసుపత్రిలో దారుణం

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (09:33 IST)
ప్రైవేటు ఆసుపత్రుల అఘాయిత్యం మరోమారు బట్టబయలైంది. ఫీజుల కోసం ఎంతకైనా దిగజారే కొన్ని ఆసుపత్రుల రాక్షసత్వం బాహ్య ప్రపంచానికి మరొక్కమారు తెలిసొచ్చింది.
 
చికిత్స అనంతరం బిల్లు చెల్లించలేదని ఒక వృద్ధుడిని వైద్యులు బెడ్‌కు కట్టేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని షాజ్‌పూర్‌ జిల్లాలో జరిగింది. రూ. 11వేలు చెల్లించకపోవడంతో అతని కాళ్లు, చేతులు కట్టేశారని వృద్ధుని కుమార్తె తెలిపింది.

ఆస్పత్రిలో అడ్మిట్‌ అయినపుడు రూ. 5 వేలు బిల్లు చెల్లించామని, అయితే పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మరికొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చిందని, దీంతో బిల్లు ఎక్కువైందని, అంత డబ్బు చెల్లించలేమని చెప్పామని ఆమె పేర్కొంది.

మొత్తం నగదు చెల్లించాల్సిందేనంటూ వైద్యులు వృద్ధుడిని మంచానికి కట్టేశారని వాపోయింది. అయితే వృద్ధునికి మూర్చ ఉన్నందునే ఆ విధంగా మంచానికి కట్టేశామంటూ ఆస్పత్రి వర్గాలు వెల్లడించడం గమనార్హం.

ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పందించారు. షాజ్‌పూర్‌లో ఉన్న ఆస్పత్రి వర్గాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, దర్యాప్తుకు ఆదేశించామని అన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments