Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు మహిళలను చంపేసిన బంకమట్టి... ఎక్కడ? ఎలా?

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (10:56 IST)
బంకమట్టి ముగ్గురు మహిళలను చంపేసింది. ఈ విషాదకర ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ రాష్ట్రంలోని దేవాల్‌బాడి పంచాయతీ పరిధిలో మీర్గా అనే కొండ ప్రాంతం ఉంది. ఇక్కడ ఇంటి కోసం తెల్లటి బంక మట్టి లభ్యమవుతుంది. దీంతో స్థానికులంతా ఆ మట్టిని తెచ్చుకునేందుకు వెళుతుంటారు. ఈ క్రమంలో మట్టి కోసం వెళ్లిన ముగ్గురు మహిళలు... మృత్యువాతపడ్డారు. బంకమట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. వీటి కింద చిక్కుకున్న మహిళలు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న జమ్తారా ఎమ్మెల్యే ఇర్ఫాన్‌ అన్సారీ, జిల్లా డిప్యూటీ కమిషనర్‌ అహ్మద్‌ ముంతాజ్‌, డీఎస్పీ అరవింద్‌కుమార్‌ ఉపాధ్యాయ, సీఐ కేదార్‌నాథ్‌తో పాటు పలువురు అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకొని, రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. జేసీబీల సహాయంతో మట్టి పెళ్లలను వెలికి తీయగా.. ముగ్గురు మహిళల మృతదేహాలు లభించాయి.
 
మృతులను నారాయణపూర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చైన్పూర్‌లోని కాక్రియాబాద్ టోల్ నివాసితులుగా గుర్తించారు. మృతులు షహ్నాజ్‌ బీబీ(30), జుబీడా బీవీ (25), మెహ్నాజ్‌ ఖటూన్‌ (20) ఉన్నారు. మహిళల మృతదేహాలను పోస్టుమార్టం కోసం జమ్తారా సదర్ హాస్పిటల్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments