Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు మహిళలను చంపేసిన బంకమట్టి... ఎక్కడ? ఎలా?

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (10:56 IST)
బంకమట్టి ముగ్గురు మహిళలను చంపేసింది. ఈ విషాదకర ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ రాష్ట్రంలోని దేవాల్‌బాడి పంచాయతీ పరిధిలో మీర్గా అనే కొండ ప్రాంతం ఉంది. ఇక్కడ ఇంటి కోసం తెల్లటి బంక మట్టి లభ్యమవుతుంది. దీంతో స్థానికులంతా ఆ మట్టిని తెచ్చుకునేందుకు వెళుతుంటారు. ఈ క్రమంలో మట్టి కోసం వెళ్లిన ముగ్గురు మహిళలు... మృత్యువాతపడ్డారు. బంకమట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. వీటి కింద చిక్కుకున్న మహిళలు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న జమ్తారా ఎమ్మెల్యే ఇర్ఫాన్‌ అన్సారీ, జిల్లా డిప్యూటీ కమిషనర్‌ అహ్మద్‌ ముంతాజ్‌, డీఎస్పీ అరవింద్‌కుమార్‌ ఉపాధ్యాయ, సీఐ కేదార్‌నాథ్‌తో పాటు పలువురు అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకొని, రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. జేసీబీల సహాయంతో మట్టి పెళ్లలను వెలికి తీయగా.. ముగ్గురు మహిళల మృతదేహాలు లభించాయి.
 
మృతులను నారాయణపూర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చైన్పూర్‌లోని కాక్రియాబాద్ టోల్ నివాసితులుగా గుర్తించారు. మృతులు షహ్నాజ్‌ బీబీ(30), జుబీడా బీవీ (25), మెహ్నాజ్‌ ఖటూన్‌ (20) ఉన్నారు. మహిళల మృతదేహాలను పోస్టుమార్టం కోసం జమ్తారా సదర్ హాస్పిటల్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments