Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకశ్మీర్‌లో మరో ముగ్గురు ఉగ్రవాదులు హతం

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (12:17 IST)
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఇప్పటికే తొమ్మిదిమందిని హతమార్చిన భారతసైన్యం తాజాగా మరో ముగ్గురిని మట్టుబెట్టింది.

భారత దళాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్‌ జిల్లాలోని సుగూ గ్రామంలో నిన్న అర్ధరాత్రి దాటిన తరువాత ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి.

ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా సిబ్బంది గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఓ ఇంట్లో ఉన్న ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు.

దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు. షోపియాన్‌ జిల్లాలో ఆదివారం నుంచి జరిగిన ఎన్‌కౌంటర్‌లలో ఇది మూడోది.

సోమవారం పింజోరాలో నలుగురు, ఆదివారం రెబన్‌లో ఐదుగురు ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు హతమార్చిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments