Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లింట విషాదం... ముగ్గురు తోబుట్టువుల సజీవదహనం

Webdunia
ఆదివారం, 28 మే 2023 (10:03 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఓ పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. తాళం వేసివున్న ఇంట్లో ముగ్గురు తోబుట్టువులు సజీవదహనమయ్యారు. మరికొన్ని రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంటి మృత్యు ఘంటికలు మోగాయి. పెళ్లికుమారుడు సహా అతడి ఇద్దరి సోదరీమణులు.. అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. అదీకూడా సజీహ దహనమైన కనిపించారు. పశ్చిమబెంగాల్‌లోని దుర్గాపుర్‌లో ఈ ఘటన జరిగింది. 
 
మృతులను మంగళ్‌ సోరెన్‌ (33), సుమీ సోరెన్‌ (35), బహమనీ సోరెన్‌ (23)గా పోలీసులు గుర్తించారు. దుర్గాపుర్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న హఫ్నా సోరెన్‌ కుమారుడు మంగళ్‌ సోరెన్‌కు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. ఆదివారం.. వధువు తరపు కుటుంబసభ్యులు మంగళ్‌ ఇంటికి వచ్చి వివాహ ముహూర్తం ఖరారు చేయాల్సి ఉంది. ఈ కారణంగానే మంగళ్‌ సోదరీమణులు సుమీ, బహమనీ శుక్రవారం పుట్టింటికి వచ్చారు. 
 
సుమీ సోరెన్‌ కోల్‌కతాలో నర్సుగా పనిచేస్తుండగా.. బహమనీ గృహిణి. వీరి తండ్రి శనివారం తెల్లవారుజామున ఏదో పని మీద మార్కెట్‌కు వెళ్లారు. ఆయన తిరిగి వచ్చేసరికి తాళం వేసి ఉన్న ఇంటి నుంచి మంటలు వస్తున్నాయి. వెంటనే తలుపు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా.. కుమారుడు, ఇద్దరు కూమార్తెలు విగతజీవులుగా పడున్నారు. హఫ్నా ఇంట్లో ఎటువంటి సమస్యలు లేవని, అసలేం జరిగిందో తెలియట్లేదని స్థానికులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments