Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో కొత్తగా మరో ముగ్గురికి కరోనా..

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (08:56 IST)
దేశంలో కరోనా కొత్త వైరస్‌ అలజడి సృష్టిస్తోంది. తాజాగా తమిళనాడులో కొత్తగా మరో ముగ్గురికి ఈ బ్రిటన్‌ వైరస్‌ సోకింది. దీంతో రాష్ట్ర రాజధాని చెన్నైలో కొత్త తరహా కరోనా బారినపడినవారి సంఖ్య నాలుగుకు చేరింది. 
 
చెన్నైలో బ్రిటన్‌ నుంచి వచ్చిన మరో ముగ్గురికి యూకే కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిందని ఆరోగ్య శాఖ కార్యదర్శి డా. రాధాకృష్ణ తెలిపారు. వారందరిని నగరంలోని కింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
 
బ్రిటన్‌ నుంచి రాష్ట్రానికి వచ్చినవారిలో ఇప్పటివరకు 44 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. మరో 12 మంది నమూనాలను పుణె వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించామని వెల్లడించారు. వారికి సంబంధించిన ఫలితాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. 
 
బర్డ్‌ ఫ్లూకి సంబంధించి రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో పరిస్థితులను పశుసంవర్ధకశాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పారు. బర్డ్‌ఫ్లూ కేసులు నమోదవుతుండటంతో కేరళ సరిహద్దుల్లో ఉన్న కన్యాకుమారి, టెన్‌కాశి, థేని, తిరుప్పూర్‌, కోయంబత్తూరు, నిలగిరి జిల్లాల సరిహద్దులను అధికారులు మూసివేశారని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments