Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం బానిసల వింత ప్రవర్తన... ఆ రాష్ట్రంలో 10 మంది మృతి

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (08:59 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. దీంతో అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రకాల సేవలు బంద్ అయ్యాయి. బంద్ అయిన వాటిలో మద్యం కూడా ఉంది. దీంతో తాగుబోతులు మద్యంలేక వింతవింతగా ప్రవర్తిస్తున్నారు. అంతేకాకుండా, పలువురు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అలా తమిళనాడు రాష్ట్రంలో మద్యంలేక ఏకంగా 10 మంది వరకు మృత్యువాతపడ్డారు. 
 
ఈ రాష్ట్రంలో అనేక మంది మద్యం బానిసలు ఇలాంటి బలవన్మరణాలకే పాల్పడుతున్నారు. కడలూరులో నాటుసారా తాగి ముగ్గురు మృతి చెందారు. అలాగే పెరంబలూరులో స్పిరిట్‌ తాగిన ముగ్గురు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉంది. మద్యం దొరకక ఇప్పటివరకు తమిళనాడులో 10 మంది మృతి చెందారు. 
 
అలాగే, కేరళ రాష్ట్రంలో కూడా మద్యం లేకపోవడంతో పలువురు ఆత్మహత్య చేసుకున్నట్టు కథనాలు వచ్చాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం వైద్యుడి సలహా మేరకు మద్యం విక్రయాలు చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. కానీ, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కడ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments