Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

ఠాగూర్
మంగళవారం, 3 జూన్ 2025 (19:01 IST)
ఉగ్రవాదులతో సంబంధాలు కలిగివున్నారన్న ముగ్గురు ఉద్యోగులపై జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం సర్వీస్ నుంచి తొలగించింది. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు తేలడంతో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
 
తొలగించిన వారిలో పోలీస్ కానిస్టేబుల్ మాలిక్ ఇష్ఫాక్ నసీర్, పాఠశాల ఉపాధ్యాయుడు అజాజ్ అహ్మద్, ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌‍గా పనిచేస్తున్న వసీం అహ్మద్ ఖాన్ ఉన్నారు. ఈ ముగ్గురూ ఉగ్రవాద సంస్థలకు సరుకులు చేరవేయడం, ఆయుధాల అక్రమ రవాణాకు పాల్పడటం, భద్రతా దళాలకు వ్యతిరేకంగా ఉగ్రవాదుల కార్యకలాపాలకు సహకరించడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
 
జమ్ముకాశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉగ్రవాదుల సానుభూతిపరులను గుర్తించి, వారిని ఏరివేసే ప్రక్రియను అధికార యంత్రాంగం ముమ్మరం చేసింది. ఇప్పటివరకు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యవర్గం సుమారు 75 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు గుర్తించి వారిని విధుల నుంచి తొలగించింది. క్షేత్రస్థాయిలో ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిని గుర్తించేందుకు నిరంతర నిఘా కొనసాగుతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments