Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఉద్యోగం కోసం 4 గంటల్లో 25 కి.మీ నడక టెస్ట్, కుప్పకూలి ముగ్గురు మృతి

ఐవీఆర్
గురువారం, 6 మార్చి 2025 (19:11 IST)
ఎప్పుడో పాతకాలం నాటి నిబంధనలను ఇప్పటికీ ఆయా ప్రభుత్వ ఉద్యోగ అర్హతలుగా కొనసాగిస్తుండటం వల్ల అవి కొంతమంది ప్రాణాలను తీస్తున్నాయి. తాజాగా ఒడిశా ప్రభుత్వం నిర్వహించిన అటవీశాఖ ఉద్యోగాల ఫిజికిల్ పరీక్ష ముగ్గురు ప్రాణాలను తీసింది. ఈ పరీక్ష ఏమిటంటే... 4 గంటల వ్యవధిలో అభ్యర్థులు 25 కిలోమీటర్లు నడక పూర్తి చేయాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యేందుకు అభ్యర్థులంతా వడివడిగా నడుచుకుంటూ వెళ్లడం ప్రారంభించారు. 
 
ఐతే ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో ముగ్గురు అభ్యర్థులు నడుస్తూ నడుస్తూనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. విపరీతమైన వేడి ఉష్ణోగ్రతలు ఒకవైపు, నడుస్తున్న సమయంలో ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటు వచ్చి చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. కాగా ముగ్గురు అభ్యర్థులు ఇలా మరణించడంపై ఒడశా ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. ప్రతి బాధిత కుటుంబానికి రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కాగా.. ప్రాణాలు పోయేంత కఠినంగా వున్న నిబంధనలను సడలించాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments