Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నుండి కోలుకున్నవారు అయ్యప్ప దర్శనానికి రావద్దు, కేరళ సర్కార్ విజ్ఞప్తి

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (11:24 IST)
ఈ నెల 16 నుండి శబరిమల మండల పూజ ప్రారంభం కానున్న నేపథ్యంలో కేరళ సర్కార్ కీలక ప్రకటన చేసింది. కరోనా బారి నుండి కోలుకున్న వారు ఇప్పుడిప్పుడే అయ్యప్ప దర్శనానికి రావద్దని కేరళ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనికి అనుగుణంగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కోవిడ్ నుండి బాధితులు కోలుకున్నప్పటికీ వారి శరీరంలో మూడు వారాల పాటు వైరస్ ప్రభావం ఉంటుందని, కాబట్టి ఇటువంటి వారు కొండను ఎక్కేటప్పుడు శ్వాస సమస్య ఏర్పడుతుందని హెచ్చరించింది.
 
శ్వాసకోశ సమస్య లేదని నిర్ధారణ పొందిన వారే కొండకు రావాలని తెలిపారు.వచ్చే నెల చివరి నుంచి మకరవిలక్కు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది. అదే విధంగా కొండకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్, భౌతిక దూరం పాటించాలని తెలిపింది. స్వామివారి దర్శనానికి 24 గంటల ముందుగా కరోనా నెగటివ్ నిర్ధారణ సర్టిఫికేటు తీసి వాటిని తమకు సమర్పించాలని తెలిపింది.
 
శబరిమల నుంచి నీలిమల, శరణ్గుత్తి వరకు ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుందని తెలిపారు. ఆయా ప్రాంతాలలో ఆక్సిజన్ ఏర్పాట్లు చేశామని తెలిపారు. అయినప్పటికీ ఆక్సిజన్ అందక ప్రతి ఏడాది సగటు 25 మంది గుండెపోటుతో మరణిస్తున్నారని తెలిపింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments